StatCounter code

Friday, December 30, 2011

ఈ యేడాది (2011) -నేను-నా పుస్తకాలు

సంవత్సరం చివరికొచ్చేసరికి అందరూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటారు కదా...నేనిప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏవీ చేపట్టదలుచుకోలేదుగానీ ఈ యేడాదిలో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయం నేనెక్కువ పుస్తకాలు చదవడం, కొనుక్కోవడం. గత మూడు నాలుగేళ్ళుగా మూలన పడేసిన నా పుస్తక పఠనాన్ని తిరిగి ఆరభించాను. ఎలాగా ఏమిటి అన్నది ఇంతకుముందే నేను-నా పుస్తకాల గోల అంటూ అరిచి గీపెట్టాను. ఇప్పుడు మళ్ళీ అరవనుగానీ ఈ యేడదిలో నేను చదివిన పుస్తకాల్ను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామని.

చదువులా, చావులా? - నామిని
ఈ పుస్తకం గురించి ఇదివరకే ఒక టపాలో కూలంకషంగా చర్చించాను. కార్పొరేటు విద్యా సంస్థల్లో చిన్నారులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో, ఆటపాటలకు దూరం అవుతూ చదువు బరువును ఎలా మోస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చెబుతూ తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు నామిని. ఆ బుజ్జాయిల మనసుని తెలుసుకుంటే ఎంతో బాధగా అనిపించింది. మిగతా వివరాలన్నీ ఈ పోస్ట్ లో చదవొచ్చు.

కృష్ణవేణి - రంగనాయకమ్మ
రంగనాయకమ్మ గారు తన పంతొమ్మిదవ యేట రాసిన మొట్టమొదటి నవలకి ఫుట్ నోట్స్ ని జోడిస్తూ తిరిగి ప్రచురించారు. ఈ కథ అప్పట్లో జ్యోతిలోనో, ప్రభలోనో సీరియల్ గా వచ్చేదిట. కథలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమీ లేవుగాని ఆవిడ రాసిన ఫుట్ నోట్స్ కోసం ఈ పుస్తకం చదివి తీరాలి. ఎప్పుడో తన చిన్నప్పుడు రాసిన కథని తనే విశ్లేషించుకుంటూ, విమర్శించుకుంటూ ఆవిడ రాసిన విధానం అద్వితీయం. ఒక నలభై, యాభై యేళ్ళ తరువాత రచయిత్రి తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుతో, పరిణితితో తన పాత రచనను నిర్మొహమాటంగా విమర్శించుకోవడమనేది రంగనాయకమ్మగారికి ఉన్న గొప్ప గుణం. Hats off to you Madam! ఫుట్ నోట్స్ లో కూడా తన హాస్యశైలిని వదిలిపెట్టలేదు. చదువుతున్నంతసేపు బాగా నవ్వుకున్నాను.

మానవి, సహజ - ఓల్గా
సుజాతగారి ధర్మమా ఆని మొట్టమొదటిసారి ఓల్గా రచనలు చదివాను. మానవి, సహజ రెండూ విలక్షణమైన రచనలు. రెండూ స్త్రీవాద రచనలే. స్త్రీకి తనదైన వ్యక్తిత్వం ఉండాలని, పెళ్ళి అయినా కూడా భర్త, పిల్లలే కాకుండా తనకంటూ ఇష్టాయిష్టాలను కలిగి ఉండాలని చెప్పే నవలలు.

సహజ విషయానికొస్తే నలుగురు చిన్ననాటి స్నేహితురాళ్ళు- పెళ్ళయ్యాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు. సహజ తప్ప మిగతా ముగ్గురు పెళ్ళి వల్ల తమ తమ వ్యక్తిత్వాలను కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నవాళ్ళే. ఎన్నో యేళ్ళ తరువాత నలుగురు కలుసుకోవడం వారి జీవితాలను చూసి సహజ ఆశ్చర్యపోవడము, పెళ్ళి అంటే వ్యక్తిత్వం కోల్పోవడం కాదని మెత్తగా చివాట్లు పెడుతూ తన ఇద్దరు స్నేహితురాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు తేగలగడం ఇదీ కథ. స్నేహితురాళ్ల మధ్య జరిగే వాదోపవాదాలు, సహజకి తన భర్తకి మధ్య జరిగే చర్చలు ఎంతో ఆలోచింపజేస్తాయి. సహజ ఉద్యోగం చేసుకుంటూ తన మనసుకి నచ్చిన ప్రసాద్ ని పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ స్వతహాగా మంచివాడు. భార్య భర్తలలో ఎక్కువ తక్కువలు లేవని, ఇద్దరూ సమానమేనని మనస్ఫూర్తిగా నమ్మినవాడు. పెళ్ళయ్యాక అలాగే మెలుగుతాడు కూడా. ఇద్దరూ ఉద్యోగస్థులు అవ్వడం వలన సహజ, ప్రసాద్ కూడా ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. అయితే ప్రసాద్ కి ఒక పెద్ద చిక్కొచ్చిపడుతుంది. తను అందరి మగవాళ్లలా కాకుండా మంచి భర్తగా మెలుగుతూ సహజకి ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉన్నాడు కదా, మరి సహజ ఇవన్నీ ఎందుకు గుర్తించడం లేదు? తనని మంచివాడుగానో లేదా ఉత్తమ భర్తగానో ఎందుకు గుర్తించడం లేదో అనుకుంటూ మధనపడుతుంటాడు. ఇంక ఆగలేక ఒకరోజు ఈ విషయాన్ని సహజ దగ్గర ప్రస్తావిస్తాడు. దానికి సమాధానంగా సహజ నవ్వుతూ చెప్పే మాటలే ఈ పుస్తకం లోని "Take away". అవి యథాతథంగా…
“నేనిన్నాళ్ళు నీ భార్యననుకోలేదు ప్రసాద్ నీకు అత్యంత ఆప్తురాలినన స్నేహితురాలిననుకున్నాను. స్నేహితులతో ప్రవర్తిస్తున్నటే ప్రవర్తిస్తున్నావు అనుకున్నానుగానీ నువు ప్రత్యేకంగా నన్ను మంచిగా, దయగా చూస్తూ నా కృతజ్ఞతను ఆశిస్తున్నావనుకోలేదు. ఎంత భ్రమలో ఉన్నాను! నేను ఆడదాన్ని ఏ హక్కులూ లేనిదాన్ని, బానిసను. నువ్వు మంచివాడివి. నీ బానిసకి అన్ని సహాయాలు చేసావు, దయగా చూసావు. అయినా ఈ బానిస తన యజమానిని గుర్తించలేదు. లోకంలో చాలామంది మగవాళ్ళు దుర్మార్గంగా ఉంటారు, నువ్వు అలా కాకుండా మంచివాడివనీ నీకు తెలుసు. కానీ నా సంగతేమిటి? నేను చాలా భ్రమల్లో ఉన్నాను. స్త్రీ పురుషులు సమానమనన్నట్లు ప్రవర్తించాను. నేను ఏ పురుషుడి కన్నా తక్కువదాన్ని అనుకోలేదు. ఏ పురుషుడైనా నా పట్ల దయగా ఉంటేనే తప్ప నా సమానత్వం సాధ్యం కాదనే విషయం నాకివాళ తెలిసింది. ఔను...సమాజంలో స్త్రీలంతా బానిసలుగా ఉన్నప్పుడు నాలాంటి ఒకరిద్దరు-మేం స్వేచ్ఛగా ఉన్నాం. పురుషులతో సమానులం అనుకోవటం ఎంత వెర్రితనం. అసలు బానిసలం అనే స్పృహ స్త్రీలకు రావాలి. ఇవాళ నాకు గొప్ప కనువిప్పు కలిగింది." అని వ్యంగ్యంగా చురక అంటిస్తుంది.
ఈ మాటలతో ప్రసాద్ కు, చదివే ప్రేక్షకులకూ కూడా జ్ఞానోదయం అవుతుంది. :)

ఇంక మానవి పుస్తకంలో భర్త, ఇల్లు, పిల్లలే లోకం అనుకుంటూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంట్లో పనిమనిషిలా చాకిరీ చేస్తూ అదే జీవితం అనుకుని ఆనందంగా గడిపే ఇల్లాలి జీవితంలో సంభవించే పెనుమార్పులు, తరువాతి పరిణామాలే మానవి కథ. వసంత, భర్త, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి తల్లిలాగే ఉంటుంది అన్ని కోణాలలోనూ. చిన్నమ్మాయి స్వతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తి. వసంత అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. కాకపోతే రాను రాను తన వ్యక్తిత్వం త్యజించి, అభిరుచులను పక్కనబెట్టి ఒక పనిమనిషిలా మారిపోతున్న భార్యతో కాపరం చెయ్యడం దుస్సాధ్యమవుతున్న భర్త మరొకరిని ఆశ్రయిస్తాడు. తల్లిని అవసరాలకు వాడుకోవాలనే చూసే పెద్ద కూతురి చెర నుండి విడిపించి తల్లిని తనతో పాటే తీసుకువెళుతుంది చిన్న కూతురు. వసంత, చిన్న కూతురు, తన స్నేహితురాళ్ళు, వాళ్ల ఆశయాలు, ఉద్యమాలు అన్నిటిలో పాలుపంచుకుంటూ జీవితంలో తను ఏమి కోల్పోయిందో, తన వ్యక్తిత్వాన్ని ఎలా విడిచిపెట్టిందో మెల్లిమెల్లిగా గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని సాధించి మానవి అవుతుంది. ఈ రచనలో మార్కిజం పాళ్ళు కాస్త ఎక్కువైనట్టు అనిపించినా చదవదగ్గ పుస్తకం.

కోమలి గాంధారం - మృణాళిని
స్వీట్ హోం తో చాలా పోలికలున్న చిన్న కథల సమాహారం. అన్ని స్త్రీవాద కథలే. కోమలి చాలా తెలివైంది. తన భర్తకి, తనతో పాటు పనిచేస్తున్న మగవాళ్ళకూ అవసరమైనప్పుడల్లా చురకలు అంటిస్తూ చాకచక్యంగా పనులను నెట్టుకొస్తూ ఉంటుంది. మొదట్లో బావున్నట్టు అనిపించినా కొన్ని కథలయ్యాక చాలా బోర్ కొట్టింది. నాకు నచ్చని విషయం ఏమిటంటే కోమలికి తన భర్త మీద అస్సలు గౌరవం లేదు. ఎప్పుడూ తీసి పారేస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్ళి చేసుకుని కాపురం చేస్తున్న భర్తని మరీ అంత హీనంగా, చులకన చెయ్యడం ఏమిటో నాకర్థం కాలేదు. స్వీట్ హోం తో పోల్చుకుంటే విమల, బుచ్చిబాబుని ఎంత వెక్కిరించినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అతను వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరచదు. కానీ కోమలి అలా కాదు. ఇది నాకు కనిపించిన నెగటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏమిటంటే కోమలి, తన అత్తగారు రెగ్యులర్ అత్త-కోడళ్ళ సీరియల్స్ లాగ కీచులాడుకోకుండా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మంచి స్నేహితురాళ్ళలా ఉంటారు. ఇది నాకు బాగా నచ్చింది.

కోతికొమ్మచ్చి - మూడు భాగాలు - ముళ్ళపూడి వెంకటరమణ
కోతికొమ్మచ్చి గురించి కొత్తగా చెప్పేదేముంది. పసందైన విందు భోజనంలాంటి రచన. మెల్లిగా చదువుతూ ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ, కాసేపు నవ్వుతూ, కాసేపు ఏడుస్తూ కొంత జీర్ణం చేసుకుంటూ, కొంత నెమరువేసుకుంటూ....ఇక్కడ తమిళంలో ఉన్న ఒక expression వాడాలనుంది...."రసిచ్చి, రుసిచ్చి, ఇనిచ్చి" చదివాను. అంటే రసాస్వాదన చేస్తూ, రుచిని అనుభవిస్తూ, తియ్యదనాన్ని నెమరువేసుకుంటూ చదివాను.

ఈ రమణ గారేంటో ఆయన కష్టాలను కూడా ఏదో కథ చెబుతునట్టు, ఆయనేకేం పట్టనట్టు చాలా మామూలుగా చెబుతారు. చదువుతున్న మనకే గుటక పడదు. తెల్లబోయి తేరుకుని కన్నీళ్ళు పెట్టాలా, వద్దా అన్న మీమాంసలో ఉండిపోతాం. కళ్ళు మాత్రం మనమాట వింటాయేంటి...మెదడు ఏదో ఆలొచిస్తుందిలే మనం కన్నీళ్ళు కార్చేద్దాం అంటూ నీళ్ళకుండల్ని జారవిడుస్తాయి. తెప్పరిల్లే టైము కూడా ఇవ్వకుండా వెనువెంటనే నవ్వించేస్తారు. ఈయన మాత్రం అసాధ్యులు, నిజంగా! ఆయన రచనావ్యాసగం, ఉద్యోగం, సినిమ అనుభవం కడురమణీయంగా ఉన్నాయి. మూడు భాగాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను.

అతడు అడవికి జయించాడు - డా. కేశవరెడ్డి
పట్టుమని వంద పేజీలు కూడా లేని పుస్తకం...పొద్దున్నుండీ, సాయంత్రం వరకూ ఒక ముసలాడి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు - అంతే కథ. చెప్పడానికి ఇంత సులువుగా ఉందిగానీ ఆ తొంభై పేజీలలో జీవిత పరమార్ధాన్ని చూపించారు. పందులను పెంచుకునే ఒక ముసలివాడు, అతని మనవడు, రెండు సుక్క పందులు - ఇవే కథలో పాత్రలు. ఒకరోజు సాయంత్రం ముసలివాని మనవడు మేతకు తీసుకువెళ్ళిన రెండు పందుల్లో ఒకదానితో మాత్రమే తిరిగొస్తాడు. రెండో పంది - కడుపుతో ఉన్నది తప్పిపోయిందని తెలుసుకున్న ముసలివాడు దాన్ని వెతుక్కుంటూ అడవిలోకెళ్ళి, రాత్రంతా అక్కడ గడిపి మర్నాడు తెల్లారాక ఇంటికి తిరిగొస్తాడు. అయితే సుక్క పంది దొరికిందా లేదా? అతని జరిపిన పోరాటం ఏమిటి? అన్నదే మొత్తం కథ. జీవనము- మరణము, సంతోషం-దుఃఖము, నిశ్చలత-అనిశ్చలత, ఆశ-నిరాశ, జయము-అపజయము, నిర్వేదం-స్థితప్రజ్ఞత, అన్వేషణ-అస్థిత్వ సంఘర్షణ...ఒకటేమిటి, వీటన్నిటి గురించీ ఉంది. మొత్తం జీవితం యొక్క తత్వాన్ని ఆ చిన్న కథలో బంధించారు. చెప్పాలంటే చాలా హెవీ డోస్. ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. ఈ పుస్తకం ఒకసారి చదివి పక్కనపెట్టేసేది కాదు. కొంచం కొంచం మెల్లిగా చదువుతూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ దానిలో మమైకమైపోతేగానీ పరమార్థం బోధపడదు. చాలా బరువైన రచన. భాష కొంచం కొత్తగా ఉండి నలగడానికి కాస్త సమయం పట్టిందిగానీ భావం నలగడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్టుంది. ఇది పూర్తిచేసేసరికి ఏమిటో నేను వేదాంతంలో పడిపోయాను..ఎంతోసేపటికిగానీ తేరుకోలేదు. ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.

వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి వీరేంద్రనాథ్
ఆ మధ్య యండమూరి నవలల గురించి బ్లాగు/బజ్జు మితృలతో ఓ పెద్ద చర్చ జరిఒగింది. యండమూరిని ని మరీ అంత తీసిపారేయక్కర్లేదు, కొన్ని చదవాల్సినవి ఉనాయి అన్న మితృల సలహా మీదట మళ్ళీ వెన్నెల్లో ఆడపిల్లతో మొదలెట్టాను. ఒక చెస్ క్రీడాకారుడు, అతన్ని అజ్ఞాతంగా ప్రేమిస్తూ కవ్వించే ఒక ఫోనమ్మాయి. ఆ అమ్మాయిని కనిపెట్టడానికి అతనికి క్లూలిస్తూ ఉంటుంది. అతను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా, ఆ అమ్మాయి కనిపెట్టాడా లేదా అన్నది కథ చదివి తెలుసుకోవాల్సిందే. మొదట్లో ఓ 20 పేజీలకవరకూ కథ బాగానే నడించింది. పాత్రల పరిచయం అదీ బాగానే ఉంది. ఆ పిల్ల ఇచ్చే పజిల్స్ అవీ తమాషాగా అనిపించాయిగానీ కాసేపయ్యేటప్పటికి బండి అస్సలు ముందుకి నడవలేదు. నాకు ఆ పజిల్స్ గోల చాలా ఎక్కువైపోయింది అనిపించింది. నిక్కుతూ నీల్గుతూ మెల్లిగా నడిపించాను మొత్తానికి. అయితే మధ్యలో జేమ్స్ పెళ్ళి గురించి జేమ్స్ మనస్తత్వ విశ్లేషణ మొదలయినదగ్గరనుండీ బాగుందనిపించింది. ఆఖరాఖరుకి ఆ పజిల్స్ ని ఆ తెలివితేటల్ని చాలా ఎంజాయ్ చేసాను. కానీ చివరికి అలా జరగడం నాకెందుకో నచ్చలేదు. ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా! ఆ పజిల్స్, కథ నడిపించిన తీరు బాగుంది అనిపించింది. అయితే మళ్ళీ మళ్ళీ చదివే నవల మాత్రం కాదు.

సాయంకాలమైంది - గొల్లపూడి మారుతీరావు
నాకు అస్సలు అస్సలు నచ్చలేదు అన్నది చిన్న expression అవుతుంది. ఏ కాలానికీ, ఏ సంఘానికీ పనికిరాని, అవసరంలేని కథ ఇది అనిపించింది. పోనీ కొత్తగా ఏదైనా నేర్చుకుందామా అంటే అదీ లేదు. పోనీ నిజాయుతీగా, చిత్తశుద్ధితో అనుకున్నది అనుకున్నట్టుగా రాసారా అంటే అదీ లేదు...రంగులు పులిమి, కంటి తుడుపు కోసం అక్కర్లేని పాత్రలు ప్రవేశపెట్టడం. పోనీ వర్ణనలను, రచనాశైలిని మెచ్చుకుందామా అంటే ఉహూ మనసొప్పట్లేలేదు.

సదాచారసాంప్రదాయాన్ని పాటించే ఒక వైష్ణవుల కుటుంబం. నాలుగో తరం నుండి వారింట్లో వచ్చే మార్పులు. పిల్లాడు పైచదువుల కోసం అమెరికా వెళ్ళడం. అమ్మాయి వేరే కులస్థుడిని పెళ్ళి చేసుకోవడం. తద్వారా ఆ దంపతులు ఎలా బాధపడ్డారు - ఇదీ కథ.

ఏ రకంగానూ నచ్చలేదు నాకు. కొన్ని వర్ణనలైతే రోత పుట్టించాయి. నవనీతాన్ని ఒక దరిద్రుడు రేప్ చేస్తుంటే కోపంతో ఆ అమ్మాయి వాడిని సగం విరిగిన సీసాని తూట్లు తూట్లుగా పొడుస్తుంటుంది. అయినా కూడా వాడు పట్టు విడువడు. అప్పుడు "కూలిపోతున్న యోధుడు శరీరమంతా బుల్లెట్లు తూట్లు పొడిచినా ఆఖరి తూటా పేల్చి ఒక్క శతృవునైనా కబళించి పోతాడు. దేశభక్తి, బాధ్యత, కర్తవ్యనిరతి వీటన్నిటినీ మించిన అతీంద్రియశక్తి శరీరంలో సమీకృతమవుతుంది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్నా పొన్నయ్య ఆ అందమయిన శరీరానికి అఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు." యుద్ధంలో యోధుడికి, రేపిస్ట్ కి పోలికా? ఇంతటి జుగుప్సాకరమైన వర్ణనని నేనింతవరకూ చదవలేదు, నిజంగా.

అలాగే ఒక వైష్ణువుడికి, క్రిస్టియన్ కి పుట్టిన అమ్మాయిని కలుపుమొక్కతో పోల్చడం....దారుణం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అందులో.

సమాజం మారుతోంది, నిజమే. అలా మారడం పై రచయిత ఏ మాత్రము గౌరవము లేనట్టు అనిపించింది. నన్నడిగితే అలా మారడం చాలా గొప్ప విషయం. ఈ సమాజపు అభివృద్ధికి సంకేతం.అయినా కుటుంబాలలో మార్పు అన్నది ఒక్క వైష్ణవ కుటుంబానికే పరిమితం కాదు. అన్ని కులాలలోనూ ఈ మార్పు జరిగింది. ఎవరి పరిధుల్లో వాళ్ళు సంప్రదాయపు బంధాల నుండి బయటపడ్డారు, పడుతున్నారు. ఈ మార్పు మంచిదే కదా. సంప్రదాయాలు, సదాచారాలు కాలానుగుణంగా మారుతాయి, మారాలి. కానీ అదేదో మహాఘోరాపరాధం అన్న భావన కలిగించారు రచయిత ఈ పుస్తకంలో. అంతే కాకుండా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన భారతీయులపై ఏ మాత్రమూ గౌరవము లేకపోవడం. వాళ్ళేదో తల్లిదండ్రులను వదిలేసి వారి సుఖం వారు చూసుకున్నట్టు, పై దేశం వెళ్ళగానే అన్నీ వదిలేసుకున్నట్టు చిత్రీకరించారు. అది చాలా అన్యాయంగా తోచింది నాకు.

ఈ పుస్తకం గురించి ఎంత తక్కువ చెపుకుంటే అంత మంచిది.

పాకుడు రాళ్ళు - డా. రావూరి భరద్వాజ
500 పేజిల పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కథ - వాళ్ళు పడే కష్టాలు, ఆ పరిశ్రమలో ఉండే రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు. చదువుతున్నంతసేపు ఎంత అసహ్యం కలుగుతుందంటే సినిమా అంటే విరక్తి కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చేవాళ్ళ దయనీయ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు రాసారు. ఈ పరిశ్రంలో ఆడది అంటే అంగడిబొమ్మ. పనికావాలంటే పక్కలోకి చేరాల్సిందే. ఈ పుస్తకం 1990 లో రాసారు. అంటే అప్పటివరకూ సినిమా పరిశ్రమలో జరిగిన సంఘటనలపై పరిశోధన చేసి రాసి ఉంటారు. అసలు అవి ఎంతవరకు నిజమో తెలీదుగానీ అలా జరిగి ఉంటుంది అన్న ఊహే గొప్ప భయంకరంగా అనిపించింది. మనకు తెలిసిన హీరోయిన్లను ఆ స్థితిలో ఊహించుకోవడానికి భయం వేసింది. అసలు ఊహించుకోవడం అసాధ్యం అయ్యింది. నమ్మబుద్ధి కాలేదు. ఏంటో బాధనిపించింది, ఏడుపొచ్చింది కూడా. ఇంకా 100 పేజీలు మిగిలున్నాయి. ఈ యేడాది లోపల అనగా రేపటి లోపల పూర్తిచెయ్యాలనుకుంటున్నాను :)

వైట్ టైగర్ - అరవింద్ అడిగా (ఇంగ్లీషు)
ఇంగ్లీషు సాహిత్యం..ఈ యేడాదిలో ఈ ఒక్కటే చదివాను. ఢిల్లీ లో ఉండే కారుడ్రైవర్ల దయనీయ పరిస్థితిని వివరించే గొప్ప రచన. మూడేళ్ళు ఢిల్లీ లో ఉంటూ కారు డ్రైవర్ల జీవన విధానాన్ని పరిశీలిస్తున్నానేమో నన్ను గొప్పగా కదిలించిది ఈ పుస్తకం. ఎక్కడో బీహార్ లో పుట్టి, తిండికి గతిలేక, ఒక్కడు పని చేసినా చాలు ఇంటిల్లిపాదీ కనీసం రెండు-మూడు రోజులకైనా తింటారు అనుకునే పరిస్థితులలోనుండి కారు డ్రైవర్లుగా నెలకి రెడు-మూడు వేల రూపాయల జీతానికి ఢిల్లీకి వస్తారు. యజమానులు వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తారు. అడుగులకు మడుగులు ఒత్తిస్తారు. నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ, మనిషిని అన్న విషయమే మరచిపోయి బతుకులీడుస్తున్న కారు డ్రైవర్ల కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా రాయడంలో అరవింద్ సఫలమయ్యారు. ప్రతీ ఒక్కరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

ఇవే కాకుండా కినిగె ద్వారా గిఫ్ట్ గా పుచ్చుకున్న పుస్తకాలు సెబాసురా శంకరా, తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు చదివాను. రెండూ అద్భుతమైన రచనలు. ఇంకా కినిగె పుస్తకాలు కొన్ని ఉన్నాయి. చదవాలి.

మొత్తానికి ఈ యేడాది నా పుస్తకపఠనము సంతృప్తికరంగానే ఉంది. ఒకే ఒక్క చిన్న అసంతృప్తి ఏమిటంటే ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువ చదవలేకపోయాను. చాలా పుస్తకాలు సగం సగం చదివి ఆపేసాను. ఈసారి అలా చెయ్యకూడదనుకుంటున్నాను. వచ్చే యేడాది ఇవి కూడా ఎక్కువ చదవాలి.

ఇక పుస్తకాల సేకరణ విషయంలో నేను అద్భుతంగా మరో అడుగు ముందుకేసాను. బోలెడన్ని పుస్తకాలు కొనుకున్నాను. బహుమతులుగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది నాకు.

2011 లో నేను కొనుక్కున్న పుస్తకాలు





ఇవి బహుమతులుగా వచ్చినవి

ఇవే కాకుండా కృష్ణవేణి, చలం-సత్యం, శైవం, సుందరం కూడా వచ్చాయి. మిధునం పుస్తకాన్ని శంకర్ గారు పంపించారు. వారికి కృతజ్ఞతలు. మిగతా పుస్తకాలన్నీ సుజాత గారు (మనసులో మాట) పంపించారు...ఆవిడకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తనకి నేనెంతో ఋణపడిపోయాను. ఇంకా కినిగె పుస్తకాలు బహుమతిగా ఇచ్చిన రెహ్మాన్ ని, మురళి కి, నాగార్జున కి ధన్యవాదములు!

ఇవే కాకుండా మరికొన్ని కొన్నాను. కానీ అవి ఇంకా నాచేతికి రాలేదు కాబట్టి, వాటిని వచ్చే యేడాడి ఖాతాలో వేస్తున్నా.

ఈ పుస్తకపఠనాన్ని, కొనుగోలుని 2012 లో కూడా ఇదే విధంగా కొనసాగించాలని అనుకుంటున్నాను...చూద్దాం! :)


47 comments:

శ్రీనివాస్ పప్పు said...

వామ్మో ఈని పుస్తకాలా??? నేను ఇందులో కొన్ని చదివినట్టున్నాను సౌమ్యా(యండమూరి,మిధునం,కోమలి గాంధారం,కోతికొమ్మచ్చి వగైరాలు)ఇంకా భరాగో వి నా దగ్గర ఏమీలేవు....శంకరం వింటున్నావా?

మధురవాణి said...

అబ్బ.. ఎన్నేసి పుస్తకాలు చదివేసారండీ.. మీరు సూపరుగా అసలు.. గట్టిగా చప్పట్లు! :)

వీటన్నీటిలో కోమలి గాంధారం, సాయంకాలమైంది మాత్రమే నేను చదివిన పుస్తకాలు. 'కోతికొమ్మచ్చి' పుస్తకం ఇంకా చదవలేదు గానీ ప్రస్తుతానికి ఆడియో పుస్తకం వింటున్నా.. :)

మధురవాణి said...

అన్నట్టు నేను కన్యాశుల్కం, మిథునం కథల పుస్తకం కూడా చదివేసాను. హమ్మయ్యా. నా లెక్క కొంచెం పెరిగింది. :))

వేణూశ్రీకాంత్ said...

అమ్మో అన్ని పుస్తకాలే సూపరు... వచ్చే ఏడాది కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను :)

వేణు said...

మీరు ఈ సంవత్సరం చాలా పుస్తకాలే చదివినట్టు. వీటిలో మంచి పుస్తకాల సంఖ్య ఎక్కువే.
అయితే ‘అతడు అడవిని జయించాడు’, ‘అమరావతి కథలు’ లాంటివి కొన్ని మరీ లేటుగా చదివినట్టున్నారు!
మరో విషయం- ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదంటూనే ‘సాయంకాలమైంది’ గురించి మిగిలినవాటికంటే కొంచెం ఎక్కువే చెప్పారు.:)

కృష్ణప్రియ said...

సౌమ్య,

చాలా సంతోషం. మీ సమీక్ష బాగుంది. కొద్దిగా జెలస్ గా కూడా ఉంది.

యండమూరి రాసిన 'వెన్నెల్లో ఆడపిల్ల' బహుశా.. ఆరోజుల్లో, ఓకే రకం ప్రేమ, కుటుంబ కథలతో విసిగెత్తి ఉన్న తెలుగు పాఠకులకు ఈ సీరియల్ ఒక మంచి రిఫ్రెషర్. మనం ఈ పుస్తకాన్ని చాలా ఏళ్ల తర్వాత చదివితే.. విసుగు రావటం సహజం :)
నాకిదే అనుభవం 'మైనే ప్యార్ కియా' సినిమా తో అయింది.

ఇక 'సాయంకాలమైంది' కథ ఆంధ్రప్రభ లో సీరియల్ గా నేను చదివి పదేళ్లయింది, పెద్దగా గుర్తులేదు.. కానీ నవనీతం పొన్నయ్య ఎపిసోడ్, కలుపు మొక్కలు, కూతురు తెచ్చిన ద్రాక్షపళ్ళు మాత్రం తిన్న తండ్రి.. I totally agree with you.

కథ వరకూ, నాలుగు తరాల కథని రచయిత ప్రస్తావించారు. ఆఖరి తరం కథ ని నేను కొందరిండ్లల్లో ప్రత్యక్షం గా చూశాను.. కాబట్టి ఆయన చెప్తున్న కథ ఫెమిలియర్ గా అనిపించింది.

ఇక సమాజం లో మార్పంటారా వస్తుంది, రావాలి కూడా. సాంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాలు కాలానుగుణం గా మారుతూనే ఉంటాయి. పరిశీలనాత్మకం గా వివరించి వదిలేస్తే మంచి రచన అయి ఉండేది.

ఆరోజుల్లో ఆంధ్రప్రభ ఆన్ లైన్ పత్రిక లో కొన్ని భాగాల లింక్స్ సరిగ్గా ఉండేవి కావు. కొంత నేను మిస్సయి ఉండవచ్చు. నేను ఇంకోసారి చదివి చూడాలి.

శశి కళ said...

సెమ్...వెణు కామెంట్...బాబొయ్...

బులుసు సుబ్రహ్మణ్యం said...

46 + 9 + కినిగే పుస్తకాలు. సుమారు 60 పుస్తకాలు ఒక ఏడాదిలో చదివారంటే ఒక యజ్ఞం లాగా అనిపిస్తోంది నాకు.

అందులో కొన్ని పుస్తకాలు చాలా ఏళ్ల క్రితం చదివాను. ఇప్పుడు చదివితే ఎలా ఉంటాయో తెలియదు. పుస్తకం చదివి షెల్ఫ్ లో పెట్టేయకుండా మీరు విశ్లేషించిన పద్ధతి బాగుంది.

2012 లో కూడా ఇంకా మంచి పుస్తకాలు చదవాలనే మీ కోరిక ఫలించాలని ఆశిస్తున్నాను.

Unknown said...

మీరు ఇలాగే ఈ ఏడాది కూడా బోలెడు పుస్తకాలు చదవాలని కోరుకుంటున్నాను.

Unknown said...

vennello Adapilla gurinchi
ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా!

ఇదే నా బ్లాగ్లో కూడా రాసాను సౌమ్యగారు.
అంత తెలివయిన అమ్మాయి తను నెల రోజులు బ్రతికేందుకు ఇంకొకరిని జీవితాంతం ఏడిపించడం సరియిన పని కాదు అని అనిపించింది నాకు కూడా...

sunita said...

inni pustakaalu chadivaaraa?naakenni ealhlhu paTTaaloe eamiToe? andukae naenaligaa:(((

S said...

చాలా కొన్నారుగా! :)

రాజ్ కుమార్ said...

ఓరినాయనోయ్... అన్ని పుస్తకాలు కొనేసీ, చదివేశారా? పైగా మరిచిపోకుండా రివ్యూలు కూడానా?
మీరు కేక సెగట్రీగోరూ.. ;) హ్మ్మ్... నేనూ చాలా కొన్నాను. కొన్న్నే చదివేను. ;(

మీరన్నట్టూ వచ్చే ఏడాదికి ఈ టైప్ పోస్ట్ వెయ్యటానికి ప్రయత్నించెదను.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

కుడిభుజం. ;)

SHANKAR.S said...

వచ్చే ఏడాదికి మీరు దీనికి రెట్టింపు సంఖ్యలో పుస్తకాలు చదవాలని కోరుకుంటున్నాను.

‘అతడు అడవిని జయించాడు’,‘అమరావతి కథలు’విషయంలో నాదీ వేణు గారి అభిప్రాయమే.

pradeep said...

nenu telugulo manchi pustakala list okati tayaru cheddamani anukuntunnanu.. induku mee sahaayam kooda kaavali. ippati varaku meeru chadiina,vinna pustakaalalo manchivi/meeku nachinavi ento cheppagalaru. ee vishayam already nenu "telugu blog" group lo kooda paste chesaan kaani evaru spandhinchaledu.. kaneesam ila ayina list tayaru cheddamani...

Anonymous said...

శైలబాల గారూ, నవలలన్నీ ఎప్పుడూ చిలిపి తగాదాలతో కీచులాడుకుంటూ, అయిన దానికీ కాని దానికీ దొంగ క్షమాపణలు చెప్పుకుంటూ అసలు ప్రేమ తప్ప ఈ లోకంలో ఏవీ లేనట్టు హీరో హీరోయిన్లద్దరూ ప్రేమ తిని, ప్రేమనే కట్టుకుని, ప్రేమలో దొర్లి ప్రేమ లోకంలో జీవిస్తుంటారని, ఉండాలని మీ అభిప్రాయమే! ఈ మధ్యే మీ వెన్నెల్లో...కాసిని పేజీలు చదివే సరికి నాకు అర్థమైన విషయం ఇది.

వెన్నెల్లో ఆడపిల్ల హీరోయిన్ నెలరోజుల్లో చావబోయే అమ్మాయి మాత్రమే కాదు. బ్రహ్మాండమైన తెలివి తేటలు గల అమ్మాయి. జీవితంలో చదువు అనే అంకాన్ని సమర్థవంతంగా పూర్తి చేసి తర్వాతి అంకం కనీసం చూడను కూడా చూడని అమ్మాయి. అందుకే బ్రతికిన నాల్రోజులూ ఒక తెలివైన అబ్బాయితో సరదాగా "మెదడు" తో ఆడుకోవాలనుకుంది ఆ అమ్మాయి. ఆ నవల్లో మీకు కేవలం "కాలక్షేపం" కనపడిందా మీకు? భేష్!

రేవంత్ జీవితంలో చిచ్చు రేగిందా? ఎలా? వాడికేమైనా పెళ్ళీ అదీ అయి, అతగాడి పెళ్ళానికి తెలీకుండా ఈ "వ్యవ్హారం నడిచిందా"?

ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా! ........అమ్మో అమ్మో! మీరు భలే వారు సుమండీ! చాలా చక్కగా, "ఎవరూ అర్థం చేసుకోని విధంగా" అర్థం చేసుకుంటారు!

రేవంత్ ఇహ జీవితాంతం ఆ విషాదంలోనే పడి ఏడుస్తూ ఉంటాడా? కొన్నాళ్ళయ్యాక తన రొటీన్లో తను పడడా?

"రమ్య రేవంత్" కి ఒక తీపి జ్ఞాపకం! తన మేథస్సుని ఛాలెంజ్ చేసి కలగా మిగిలిపోయిన ఒక అందామైన చిత్తరువు రమ్య!\

మరీ అంత ప్రాటికల్ గా..."పిల్లకేం? పోతుంది...ఆ తర్వాత బాధ పడేది ఎవరూ?" అని ఆ నవలి అనేక మంచి రచయిత్రులు రాస్తున్న "సి" క్లాసు నవలల్లో చేర్చకండి. మీకు పుణ్యం ఉంటుంది.

సిరిసిరిమువ్వ said...

భేష్..భేష్..చాలా పుస్తకాలు చదివావు.నీ పుస్తక పటనా వ్రతం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ..నిన్ను అభినందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

Disp Name said...

ఆ సౌ గారి అసమాన్య సౌమ్యాసింహావలోకనం
అడవిని జయించి, కోతీ కొమ్మచ్చీ ఆడి, రసిచ్చి, రసిచ్చి, ఇనిచ్చి, తినిచ్చి, తిరిచ్చి, మైమరిచి చదివితి బో బాలాకుమారీ సుకుమారీ పుస్తక ధారీ మా బ్లాగ్ వేణీ!

నూతన వత్సర శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

శేఖర్ (Sekhar) said...

గుడ్ గుడ్ ....అన్ని తెలుగే ..... :-))
విశ్లేషణ బాగుంది

జయ said...

It is so nice. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Unknown said...

kiran kumar garu

కానీ చివరికి అలా జరగడం నాకెందుకో నచ్చలేదు. ఒక్క నెల రోజులు బతికే అమ్మాయి తన కాలక్షేపం కోసం నిండు నూరేళ్ళు జీవించే ఒక అబ్బాయి జీవితంలో చిచ్చు రేపడం సమంజసంగా లేదు. ఆ పిల్లకేం, ఎలాగూ పోతుంది కానీ ఆ అబ్బాయి ఇకపై బతకాలి...అది కష్టం కదా!

ఈ మాట రాసింది నేను కాదు సౌమ్య గారు.

ఒక చిలిపి అమ్మాయి ఒక అబ్బాయికి ఫోన్ చేసి నా పేరు చెప్పు అని మొదలుపెట్టి తనకి తెలీకుండా ప్రేమలో పడిపోయింది.ఆ అబ్బాయి అంతే. ఇక ఇద్దరు కలుస్తారు అని అనుకుంటుండగా ఆ అమ్మాయి ఒక మెమరీ గా మిగిలిపోతుంది.తను చనిపోతాను అని తెలిసి ఒక అబ్బాయికి జీవితాన్ని వాగ్దానం చేసి చివరికి వచ్చేసరికి నేను చనిపోయాను నన్ను క్షమించు అని చెప్పడం రచయిత ఎంత గొప్పగా అయిన రాసి ఉండచ్చుగాక కాని చివరికి వచ్చేసరికి ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. అన్ని విషయాలో బాధ్యతగా ఉన్నట్టు చూపించి చివరికి వచ్చేసరికి కేవలం తన ఆనందం కోసం మరొకరికి జీవిత కాలం వేదనని మిగిల్చిన ఆ అమ్మాయి మీద నాకు సానుభూతి కన్నా కోపమే కలుగుతుంది. అది కల్పనే కావచ్చు కాని జీవితం అయితే ఆ అబ్బాయి తట్టుకోగలడా ...అసలు జీవితం ఉంటుందా ఉన్నా ఆ సూన్యతని భరించగలరా ?

ఇది నేను నా బ్లాగ్ లో రాసింది.
ఆ అమ్మాయి తెలివి తేటల గురించి నేను ఎక్కడా కూడా తక్కువచేసి మాట్లాడలేదు.

నవలలన్నీ ఎప్పుడూ చిలిపి తగాదాలతో కీచులాడుకుంటూ, అయిన దానికీ కాని దానికీ దొంగ క్షమాపణలు చెప్పుకుంటూ అసలు ప్రేమ తప్ప ఈ లోకంలో ఏవీ లేనట్టు హీరో హీరోయిన్లద్దరూ ప్రేమ తిని, ప్రేమనే కట్టుకుని, ప్రేమలో దొర్లి ప్రేమ లోకంలో జీవిస్తుంటారని, ఉండాలని మీ అభిప్రాయమే

నవలలన్నీ అన్నారు...
నేను అలంటి అభిప్రాయం ఎక్కడ చెప్పానండి?
వెన్నెల్లో గోదావరి నేను రాసిన రెండో నవల...
నేను పుంఖాలు పుంఖాలుగా రాసి ఉంటె మీరు ఆ మాట చెప్పి ఉంటె బావుండేది.

ఇంతకన్నా ఈ విషయంమీద నేను మాట్లాడాలని అనుకోవడం లేదు.
మీరు అన్నట్టు నేను ఎక్కడ కూడా వెన్నెల్లో ఆడపిల్ల కి c క్లాసు ఇవ్వలేదు.

సుభ/subha said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మేధ said...

Woww! చాలా కలెక్షన్.. ఈ సంవత్సరం కూడా మరిన్ని పుస్తకాలు చదవాలని కోరుకుంటున్నా..
And wish you a wonderful year ahead :)

Indian Minerva said...

ఇందులోని చాలా పుస్తకాలు నేనుకూడా చదివానోచ్

Ruth said...

హ్మ్మ్... బాగుంది, చాలా కుళ్ళుగా కూడా ఉంది. నేను కూడా చాలా పుస్తకాలు చదివిన, ఇలా రాయడం మాత్రం నావల్ల కాదు :(
మీ లిస్ట్ లో నేను చదివినవి వెన్నెల్లో... (దీనికి రివ్యూ కూడా అనవసరం)ఇంక white tiger (ఇది నేను ఏప్పుడో చదివినా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చదివాను) ఐనా నా లిస్ట్ లో రీ రెడ్స్, రీ రీ రెడ్స్ ఎక్కువుంటాయి అందుకేనేమో లిస్ట్ రాయటం కుదరదు.
మీకు అభినందనలు.... సరే గానీ, మీకు పుస్తకాలు గిఫ్టులిచ్చేవాళ్ళని నాకు కూడా పరిచయం చెద్దురూ కొంచెం :)

vivek said...

inni books bane chadivindru...great!!books chadive vallaki kuda awards icche rojulu ravali..aa award meere thisukovali...:D

and "sowmya-pusthakalu"..ee rendu padhaalu ekkada kanapadina...naku meeru isthananna ranganayakamma gari "sweet home" book ee gurthosthundi....koncham dani sangathi chudundri mari!! :P

ఆ.సౌమ్య said...

@ పప్పుసారు
ధన్యవాదములు...ఏదో ఈ మధ్యే మొదలెట్టాను ఇలా చదవడం!

@ మధుర
Thanks dear!
ఒహ్ కోతికొమ్మచ్చి ఆడియో వింటున్నావా..good! నేనూ వినాలి...త్వరలో మొదలెడతా!

@ వేణు
Thanks a lot.
ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను...చూద్దాం :)

ఆ.సౌమ్య said...

@వేణు గారూ
ధన్యవాదములు. అమరావతీ కథలు నేను ఎప్పుడో, చిన్నప్పుడే చదివేసానండీ లైబ్రరీ నుండి తీసుకుని. అయితే పుస్తకం ఇప్పుడు కొనుక్కున్నాను అంతే.

నేను కొనుక్కున్న పుస్తకాలలో చాలామటుకు ఇంతకుముందు చదివినవే. కాకపోతే ఇప్పుడు వాటిని సొంతం చేసుకున్నాను.

హహహ అంతా రాసేసాక నేనూ అదే అనుకున్నానండీ...రాయకూడదనుకుంటూనే ఎక్కువ రాసేసాను సాయంకాలమైంది గురించి. ఈ పాయింట్ ఎవరైనా తీసుకొస్తారు అనుకుంటూనే ఉన్నాను. మీరు ప్రస్తావించారు :)

@శశికళ గారూ
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ కృష్ణప్రియ గారూ
ధన్యవాదములు!

వెన్నెల్లో ఆడపిల్ల...మీరు చెప్పినది నిజమే. అయినా యండమూరి కథలు చదివి ఎంజాయ్ చేయగలిగే వయసు, మనసు కూడా దాటిపోయానేమో నేను!

సాయాకాలమైంది లో...నిజమే, చాలామంది ఇళ్ళల్లో అలా జరగొచ్చు. అది ఒక వైష్ణవకుటుంబాలకే కాదు ఏ కుటుంబానికైనా జరిగి ఉండవచ్చు. ఒక పరిశీలనాత్మక విశ్లేషణ చేసుంటే బావుండేది...కానీ అదేదో తప్పులాగ చూపించడమే నాకు నచ్చలేదు.

@ శైలబాల
thanks, వెన్నెల్లో ఆడపిల్ల గురించి నాకూ అదే అభిప్రాయం!

ఆ.సౌమ్య said...

@ బులుసు గారూ
అయ్యయ్యో, మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారండీ. నేను విశ్లేషించినవే నేను చదివిన పుస్తకాలు. బొమ్మల్లో ఉన్నవి నేను కొనుక్కున్న పుస్తకాలు. చదవడానికి, కొనడానికి మధ్య కొన్ని నెలలు, ఒక్కోసారి కొన్ని యేళ్ళు గడిచిపోతుంటాయండీ :)

Thanks for your wishes!

@ సునీత గారూ
అలిగారా...అబ్బే ఉత్తుత్తినే, ఉళక్కి...నేనేమీ పెద్దగా చదవలేదు. అలక్కండి :)

ఆ.సౌమ్య said...

@ S
బానే కొన్నానండీ:)
Thanks!

@రాజ్
Thanks కుడిభుజం!
మరే...కొన్నాక, చదవకుండా ఉండలేను. చదివాక ఏదో ఒకటి బరక్కుండా ఉండలేను :)
నువ్వు ఈ యేడాదిలోనైనా కొన్న పుస్తకాలు తెరుస్తావని ఆశిస్తున్నా! :)

ఆ.సౌమ్య said...

@ శంకర్ గారూ
అతడు అడవిని జయించాడు - విషయంలో మీరు, వేణు గారు కరక్టే. కొంచం ఆలశ్యమైంది. కానీ అమరావతి కథలు ఎప్పుడో చదివేసాను. కానీ ఇప్పుడే కొనుక్కున్నాను. Thanks for your wishes!

@ ప్రదీప్ గారూ
Thanks!
మంచి పుస్తకాలంటే చాలా ఉన్నాయండీ. నేను కొనుక్కున్న పుస్తకాలు, అలాగే ఇంతకుముందు "నేను నా పుస్తకాల గోల" అని ఒక టపా రాసాను. అందులో కూడా కొన్ని ఉన్నాయండీ. అవన్నీ మీకు లిస్ట్ తయారుచెయ్యడానికి దోహదపడుతాయి అనే అనుకుంటున్నాను.

ఆ.సౌమ్య said...

@kiran kumaar
Thanks fo ryour opinion!

@ సిరిసిరిమువ్వ గారూ
ధన్యవాదములు! ఈ యేడాది కూడా ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

@ జిలేబి గారూ
మీ పొగడ్తకి...మానసము విహంగమై రెపరెపలాడినది, రివ్వున ఎగిరి ఆనందాకాసమున విహరించినది...ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ శేఖర్
thanks, నేనెక్కువ తెలుగే చదువుతాను మరి :)

@ జయ గారూ
ధన్యవాదములు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

@సుభ గారూ
ధన్యవాదములు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఆ.సౌమ్య said...

@ మేధ గారు
Thanks a lot and Wish you the same!

@ Indian Minerva
good....keep it up! :)

ఆ.సౌమ్య said...

@ Ruth
హహహ కుళ్ళుగా ఉందా!
నేను కూడా చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటానండీ. క్రితం యేడాది కూడా నేను చదివినవి మళ్ళీ చదివాను. ఉదాహరణకి చలం స్త్రీ, తిలక్ కథలు etc. కానీ వాటిని ఇక్కడ ప్రస్తావించలేదు. ఇప్పుడు కొత్తగా చదివినవాటిని మాత్రమే విశ్లేషించాను.

హహహ బహుమతులిచ్చేవాళ్ళా...తప్పకుండా!

@వివేక్
హహహ అలాంటి అవార్డ్ ఏదైనా ఉంటే మనకొచ్చేటట్టు చూడు బాబు :)
ఈసారి నేను హైదరాబాదు వస్తే, నీకు ఆ పుస్తకం కొనిచ్చేస్తాను తప్పకుండా, సరేనా!

Kottapali said...

IMpressive!

I read White Tiger when it had won Booker Prize. I did not like it. However, it has some angles/depths that can not be ignored.

ఆ.సౌమ్య said...

నారాయణ స్వామి గారూ
ధన్యవాదములు!
వైట్ టైగర్ మీకెందుకు నచ్చలేదో వివరించగలరా? నచ్చకపోవడానికి కారణం కథ ముగింపా? ఒకచోట దొంగతనం, హత్య చేసినవ్యక్తి వేరేచోట కొత్త జీవితం గడుపుతూ success అవ్వడం అన్నది కొంత వరకూ సత్యదూరమే కానీ ఢిల్లీలో కారు డ్రైవర్ల పరిస్థితి బాగా వివరించారు ఆ పుస్తకంలో. నాకు మాత్రం హృదయానికి హత్తుకుంది ఈ పుస్తకం.

జ్యోతిర్మయి said...

సౌమ్య గారూ బావుందండీ మీ పుస్తక సమీక్ష...ప్రతి ఒక్కరూ చేసుకోవలసినది. చూస్తాను ఈ సంవత్సరం నేనెన్ని చదివానో.. 'సహజ' చదివాకే మా వారు నాకు సహాయం చెయ్యడం మానేసి తన పని చేయడం మొదలెట్టారు.

ఆ.సౌమ్య said...

@జ్యోతిర్మయి గారు
ధన్యవాదములు! మీరు కూడా మీరు చదివిన పుస్తకాల గురించి తప్పకుండా రాయండి.
హహహ మీవారు తన పని తాను చేసుకుంటున్నారా...సహజ బానే పనిచేసిందన్నమాట! :))

Chandu S said...

అమ్మో సౌమ్య ( అ. సౌమ్య ) చాలా బాగా వ్రాశారు. సామాన్యురాలు కాదు మీరు. ఆ పుస్తకాలు గుర్తు తీసుకొస్తూ, ఏదో రుచిని అందిస్తారు మీరు. మీ రివ్యూలు మళ్ళీ మళ్ళీ చదువుతాను

ఆ.సౌమ్య said...

శైలజ గారూ
ధన్యవాదములు...ఏదో మీ అభిమానం!
మళ్ళీ మళ్ళీ చదువుతానన్నారు...చాలా ఆనందమనిపించింది. Thanks! :)

Ramakrishna said...

సౌమ్య గారు, పుస్తకాల మీద మీ సమీక్షలు బాగున్నాయి. ఇంకా, మీరు చదివిన పుస్తకాలని ఫొటో తీసిపెట్టాలన్న ఐడియా బాగుంది.

Lasya Ramakrishna said...

సౌమ్య గారు, పుస్తకాల ఫొటోస్ ని నిండా వడ్డించిన విస్తరిలా పెట్టారండి.

ఆ.సౌమ్య said...

@ రామకృష్ణగారూ
చాలా ధన్యవాదములు!

@ లాస్య గారు
చాలా చాలా thanks!

lakshmana kumar malladi said...

హమ్మో హమ్మో!! ఈ పుస్తకాలనీ మీవే (అసూయ). గొప్ప పుస్తకాల పురుగండీ మీరు. నేనొక బ్లాగు పుస్తకాల పురుగు పేరుతో మొదలుపెట్టా గానీ, ఇంకా తెల్ల కాగితాల పుస్తకం గానే ఉంది. మీకు గానీ నేను గాని దాన్ని అచ్చంగా ఇచ్చేసననుకోండి, మీరు పరా పరా గీకి రాసిపరేయ్యచ్చు.

విన్నకోట నరసింహా రావు said...

మీ బ్లాగ్ గురించి నాకు ఇటీవలే తెల్సింది. అందుకని ఇప్పుడు వ్రాస్తున్నాను. ఈ టపాలో మీరు ప్రస్తావించిన "పాకుడురాళ్ళు" పుస్తకం 1990 ది కాదు. అంతకు చాలా ముందే వ్రాసినది. 1960 వ దశకం నాటి రచన.