StatCounter code

Thursday, September 30, 2010

చెక్కిన చేతులకు జోహార్లు-3

మధురై....బహుశా ఈ పేరు తెలియని భారతీయులుండరేమో. మధురం (తియ్యనిది) అన్న పదం నుండి మధురై వచ్చిందని చెబుతారు. మొదట ఈ ప్రదేశంలో కదంబవనం అనే అరణ్యం ఉండేదని, అక్కడ స్వయంభువు అయిన శివలింగం కనిపించిందని, ఆ శివుని ఆదిగా చేసుకుని గుడిని, దాన్ని పునాదిగా చేసుకుని నగరాన్ని పాండ్య రాజులు నిర్మించారని చెబుతారు. ఆ శివలింగం నుండి మధురం (అమృతం) జాలువారినది కాబట్టే ఆ నగరానికి మధురై అని పేరు వచ్చిందని ఒక కథ. మరో కథనం ప్రకారం మీనాక్షిని పెళ్ళి చేసుకోవడానికి శివుడు భూలోకానికి వచ్చినప్పుడు కొన్ని అమృతపు చుక్కలను రాల్చాడని అందుకే మధురై అని పేరు వచ్చిందని ఒక నమ్మకం. ఆధునిక చరిత్రజ్ఞులు ఏమి చెబుతున్నారంటే ఈ గుడి క్రీ.శ 7 వ శతాబ్దానికి చెందినదని, ఆనాటి గుర్తులన్నిటినీ తరువాతి కాలంలో వచ్చిన ముస్లిం రాజులు ధ్వంసం చేసారని, పిమ్మట నాయకర్ రాజులలో మొదటివాడైన విశ్వనాథ నాయకర్ దీన్ని పునఃనిర్మించాడానికి పునాది సిద్ధం చేసారని, నాయక రాజులలో అగ్రగణ్యుడైన తిరుమల నాయకర్ ఈ గుడిని అభివృద్ధి పరిచారని.

"సంగం" కాలం నుండి క్రీ.శ 10-11 శతాబ్దాల వరకు పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. తరువాతి కాలంలో కొన్నాళ్ళు చోళులు, ముస్లిం రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. విజయనగర రాజులకి సామంతులుగా ఉన్న నాయకర్ రాజులు ఈ ప్రదేశాన్ని కాపుగాసేవారు. శ్రీకృష్ణదేవరాయుని కాలానంతరం నాయకర్ రాజులు ఈ మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకుని క్రీ.శ 16 వ శతాబ్దము నుండి సుమారు 200 యేళ్ళు అజరామరంగా పాలించారు. పాండ్యుల కాలంలో రోమ్, గ్రీసు లతో నుండి వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. మధురై ని "Athens of the East" గా పిలిచేవారు. ఈనాటికీ తమిళనాట రెండవ పెద్ద పట్టణంగా వెలుగొందుతున్న మధురై, మీనాక్షి అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. మరి ఆ ఆలయ విశేషాలు, ఇతర చారిత్రాత్మక ప్రదేశాల వివరాలేంటో చూద్దామా? రండి.

మధురైలో చెప్పుకోదగ్గ ప్రదేశాలు రెండు; ఒకటి మీనాక్షి గుడి, రెండవది తిరుమల నాయకర్ మహల్. మొదట గుడి చూసేద్దామేం. ఈ గుడిలో 14 గోపురాలున్నాయి. అందులో రెండు బంగారు గోపురాలు. ఈ 14 గోపురాలలో అతి పొడవైన గోపురం ఎత్తు 170 అడుగులు. ఇక్కడ పార్వతినే మీనాక్షిగా కొలుస్తారు. శివుని పేరు సుందరేశ్వరుడు. మీనాక్షి, సుందరేశ్వరుని గర్భగుడులకి బంగారు గోపురాలున్నాయి. ఈ ఆలయం మొత్తం రకరాకల రంగులతో నిండి ఉంటుంది. ఎక్కువగా ఆకుపచ్చ రంగు కనిపిస్తూ ఉంటుంది. గుడి లోకి అడుగు పెట్టగానే ఆకర్షించిన విషయమేమిటంటే స్థంబాల మీద ధర్మరాజు, అర్ఝునుడు మొదలగువారికి పెద్ద పెద్ద మీసాలుండడం, ద్రావిడుల (దక్షిణ భారత దేశపు ప్రజల) ముఖ కవళికలు, శరీర దారుడ్యం స్పష్టంగా తెలియడం ....భలే నవ్వొచ్చింది, అవన్నీ చూస్తే. కాసింత ముందుకెళ్లగానే మీనాక్షి గుడి నమూనా కనిపించింది. మొత్తం గుడి నమూనాని అలా చూడడం భలే అనిపించింది. గుడి మధ్యలో ఉండే కొలను ప్రత్యేకాకర్షణ. కానీ మేము వెళ్ళినప్పటికి అక్కడ ఉన్న కొలనుని కడుగుతున్నారు కాబట్టి బంగారు పద్మం, ఆ అందాలు చూడలేకపోయాము.

గుడి ముఖద్వార గోపురం

ఆలయ నమూనా

మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం

ఇది చాలా పెద్ద గుడి, లోపలంతా తిరిగాలంటే గంట పైనే పడుతుంది. ఆ గుడి మండపం అంతా అద్భుతమయిన కళా సంపద కలిగి ఉంది.. వసంత మండపం, వేయి స్థంబాల మండపం, బంగారు పద్మం, అష్ట శక్తి మండపం, ఉయ్యాల మండపం (ఇక్కడ చిలుకలు అమ్మ నామస్మరణ చేస్తూ ఉండడం విశేషం), ముఖ్యంగా ప్రవేశ ద్వారం దగ్గరే ఉండే సిద్థివినాయకుడు చూసితీరాల్సినవే. ఈ గుడిలో దేనికదే ప్రత్యేకమయినా అన్నిటికన్నా ప్రత్యేక ఆకర్షణ నలువైపులా ఉన్న వరండాయే, అందులో ఉన్న శిల్పకళా సంపద.

గుడి లోపలి భాగం-1

గుడి లోపలి భాగం-2

గుడి లోపలి విగ్రహాలు-1

గుడి లోపలి విగ్రహాలు-2

గుడి లోపల కొంతదూరమెళ్ళాక ఫొటోలు నిషిద్ధం, అందుకే ఎక్కువ తియ్యలేకపోయాను. మీనాక్షి దర్శనం చేసుకున్నాం. బృహదీశ్వరాలయంలో శివుణ్ణి చూసినప్పటి ఉద్వేగం అయితే కలగలేదు నాకు. సుందరేశ్వరుడు కూడా మామూలే. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మీనాక్షికి, సుందరేశ్వరునికి ఒక పడక గది ఉంది. అది చూస్తే నాకు విపరీతమైన నవ్వు వచ్చింది, నమ్మకం వెర్రితలలు వెయ్యడమంటే ఇదేనేమో అనిపించింది.

గర్భ గుడి బయటకి వచ్చిన తరువాత గమనించిన విషయమేమిటంటే ఒక స్థంబం పక్కన ఉన్న ఒక చిన్న పలక మీద ఒక్కొక్కరూ నిలుచుని పై కప్పుకేసి చూస్తున్నారు. ఎందుకు అందరూ అలా చూస్తున్నారో అని మేమూ వెళ్ళాం. ఆ పలక ఎక్కకుండా స్థబం పక్కనుండి పైకి చూసాం. పైకప్పుకి ఒక చిన్న కన్నముంది. అందులో నుండి ఆకాశం కనిపిస్తున్నాది. గుడి బయటికెళ్తే హాయిగా విశాలమైన ఆకాశాన్ని చూడొచ్చు, ఇక్కడ ఈ చిన్న కన్నంలో నుండి చూసేదేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ కాసేపు అక్కడే తచ్చాడాం. అటు జరిగి, ఇటు జరిగి రకరకాల భంగిమలలో నిలుచుని పైకప్పుకేసి చూస్తూ ఉన్నాం ఏమైనా కనిపిస్తుందేమో అని. కాసేప్పయ్యాక మాకు వెలిగింది ఆ పలక ఖచ్చితంగా ఎక్కాలని. ఎక్కి చూసాక తెలిసింది అసలు విషయం, ఏమిటంటే... ఆ కన్నం లో నుండి చూస్తే బంగారు గోపురం కనిపిస్తుంది. ఆ సువర్ణ గోపురం మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆ పలక మీద నిల్చున్న మన మీద ప్రకాశిస్తాయి. మేలిమి బంగారు ఛాయలో ఉన్న ఆ కిరణాలు మా మీద పడగానే భలే సరదా వేసింది. ఒక్కొక్కరం మళ్ళీ మళ్ళీ ఆ కిరణాల కింద నిలుచున్నాం. ఆ కిరణాలు మనమీద అలా జారుతూ ఉంటే ఒక రకమైన మంచి అనుభూతి.....హ్మ్ ఎలాగంటే దివ్య తేజస్సుతో వెలుగుతున్నట్టు, అందరికంటే ఎత్తులో మనమున్నట్టు, శరీరం కొత్త ఛాయలను సంతరించుకున్నట్టు, మనసు స్వేచ్చావిహంగమైనట్టు, ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు (నాకు తెలిసిన గొప్ప అనుభూతుల్లో ఇదీ ఒకటి మరి :D)

ఇప్పుడు అతి ముఖ్యమైన, నేను నా టపాకి పెట్టిన పేరుని సార్థకపరిచే అంశం. ఇక్కడ ఒక వేయి స్థంబాల మడపం ఉంది. సౌందర్య ప్రభంజనం అంటారే, అదేమిటో తెలిసొచ్చింది మండపంలోకి అడుగుపెట్టగానే. వెళుతూనే కుడివైపున కొన్ని సన్నని స్థంబాలున్నాయి. వాటి మీద వాయిస్తే "స రి గ మ ప ద ని" అన్న స్వరాలు చాలా ఖచ్చితంగా వినిపిస్తాయి. "రాతి స్థంబాలకే చేతనత్వము కలిగి సరి గమ ప ద ని స పాడగా" అన్న (శిల్పుల) చరణాలు గుర్తొచ్చాయి. ఒక్కో స్థంబం పైన ఒక్కో కళాసృష్టి..."వస్తువు"లో ఉండే అత్యంత సూక్ష్మ విషయాలను కూడా అతి లాఘవంగా చెక్కిన రీతి.... ప్రతీ ప్రతిమలోనూ హృదయాన్ని ఆవిష్కరించిన కళా పిపాస.....భావ వైశాల్యపు హద్దులు చూసిన సృజన. కాలి వేళ్ళు, నరాలు, కండలు, నెమలి ఈకలు, బుట్ట అల్లికలు, ఒకటేమిటి......అవి రాళ్ళు కావు, అది శిలాప్రతిమలు కావు, నవనాడుల్లోనూ జీవం పోసుకున్న అద్భుత మూర్తులు....మనిషి సృష్టించిన అపురూప ఆనందస్వరూపాలు. అవి చూసాక నరనరాల్లోంచి ఉప్పొంగిన ఆనందాన్ని, హృదయం భరించలేక కళ్ళంట నీరుగా వదిలింది, నిజం. ఆ మహా శిల్పులకు, ఉత్తమోత్తములైన కళాపిపాసకులకు జోహార్లు జోహార్లు జోహార్లు! ఈ మండపంలో ఉన్న మరో విశేషం ఎటుచూసినా స్థంబాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. అన్ని కోణాలలోనుండి మండపం "చివర" ను చూడవచ్చు. ఈ మండపం లోపల నటరాజస్వామి చూడచక్కని రూపంతో కనువిందు చేస్తాడు. అన్నిటినీ తనివితీరా చూసి, గొప్పదైన స్పూర్తితో, హృదయాంతరాళాల్లోంచి పొంగిన ఆనందంతో గుడి బయటకొచ్చాము. చాలు, ఇక అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది.

నెమలిపైనున్న కార్తికేయుడు

నెమలి ఈనెలు, పాదం తొడని తగిలిన చోట వంపు ఇంకా ఎన్నో ఎన్నెన్నో....గమనించండి

కాలి వేళ్ళు, గోళ్ళు...పరిశీలించండి

నెమలి వేళ్ల మీద ఉబ్బిన నరాలు...చూసారా!


బుట్ట మీద ఉన్న అల్లిక.....కనిపించిందా!


ఇందులో నాలుగు కోతులున్నాయి...కనుక్కోండి చూద్దాం :)

వేయి స్థంభాల మడపంలోని నటరాజు




మండపంలోని నాలుగు దిక్కులూ

ఇక ఈ మధురైనగరిలో చూడవలసిన ప్రాముఖ్యమైన ప్రదేశం తిరుమల నాయకర్ మహల్. ఈ కోటలోని అతి ముఖ్య భాగాలను మాత్రమే తమిళనాడు ప్రభుత్వం నిబద్దతతో కాపాడుతోంది. మిగతా భాగాలు జనవాహినిలో కలిసిపోయాయిట. ఈ కోటలో పురాతన కాలం నాటి నాణాలు, వస్తువులు, శిల్పాలు అనేకం ఉన్నాయి. కోటలోని కొన్ని దృశ్యాలు మీ కోసం.....

కోట లోపలి పైకప్పు





నాట్య శాల


రాజు గారి సభా మండపం


క్రీ.శ 900 కాలంనాటి శిల్పం


అవండీ మధురై వింతలూ, విశేషాలు.

అయిపోలేదు, ఇంకా ఉంది.... మరో కొత్త ప్రపంచాన్ని చూడాలంటే కాస్త ఆగాలి సుమండీ.

70 comments:

sunita said...

మీనాక్షి ఆలయంలో వెన్న హనుమంతుడు ఉంటాడు చూసారా? భక్తులందరూ వెన్న కొని మరీ గొటితో విగ్రహం పై పడేలా విసురుతారు.గర్భగుడి వెలుపలే.నాయకర్ మహల్ నేను చూళ్ళేదుకానీ ఈ గుడి చూసాను. అన్ని భాగాలూ అయ్యాక కామెంటుదామనుకున్నాను కానీ నేను కూడా చూసిన గుడి ఐయ్యేసరికి ఆత్రం కదా? నేను నేను ఈ టపాలో ఫొటోలు చాలా బాగున్నాయి.

హరే కృష్ణ said...

excellent!

ఆ.సౌమ్య said...

@ సునీత గారు,
ధన్యవాదములు. మీరు వెళ్ళారా మీనాక్షి గుడికి...భలే ఉంటుంది కదండీ!
ఈ వెన్న హనుమతుడు నాకెక్కడా తగల్లేదండీ, గుడి మొత్తం చూసానే! :O
ఈసారి వెళ్తే మటుకు నాయకర మహల్ కూడా చూడండి, చాలా బావుంటుంది.

@ హరేకృష్ణ
ధన్యవాదములు

శ్రీనివాస్ పప్పు said...

ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు (నాకు తెలిసిన గొప్ప అనుభూతుల్లో ఇదీ ఒకటి మరి )
హ్హహ్హహ్హ సూపర్.

"రాతి స్థంబాలకే చేతనత్వము కలిగి సరి గమ ప ద ని స పాడగా" అన్న (శిల్పుల) చరణాలు గుర్తొచ్చాయి.నిజమేనండీ ఆ శిల్పసంపద అనన్యసామాన్యం అని చెప్పాల్సిందే.

అసలు చెప్పాలంటే ఈ గుడిమీదా,ఆ వేయిస్థంభాల మండంపం మీదా ఓ డాక్యుమెంటరీ తీసితీరాల్సిందే ఎవరయినా.ఎప్పుడు తీరుతుందో మరి అది.

ఆ.సౌమ్య said...

@ శ్రీనివాస్ గారూ
ధన్యవాదములు :)
అవునండీ డాక్యుమెంటరీ తియ్యాలి, ఎంత చెప్తే మాత్రం తనివితీరుతుంది. మీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను :)

సుజాత వేల్పూరి said...

హమ్మయ్య, గుళ్ళో ఉండే కోనేర్లను కడుగుతారు కూడా అన్నమాట!
గుడిలోపలి భాగం -1 ఫొటో ఎక్కడినుంచి తీశావు ? పై నుంచా?

శిల్పాల్లోని ప్రతి సూక్షాంశాన్నీ బాగా పరిశీలించావల్లే ఉంది సౌమ్యా! రంగుల దీపాల్లో వేయి స్థంభాల మండపం చాలా బావుంది.
ఫొటోలు మాత్రం చక్కగా తీశారు. బ్రిలియంట్!

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ,
హహహ కోనేర్లు కడుగుతారండీ:D. గుడిలోపలి భాగం -1 కిందనుండే తీసానండి, అవి పైకప్పు మీదున్న చిత్రాలు. మనకి కళలు అంటే ప్రత్యేకమైన అభిమానం కదండీ, అందుకే బాగా దగ్గరుండి పరిశీలించాను అన్నీ. దాదాపు మూడు గంటలు పట్టింది అన్నీ చూడడానికి. ఫొటోలు నచ్చాయా మీకు, నెనర్లు :)

Kalpana Rentala said...

మీరు రాసింది బావుంది.

" మధుర మీనాక్షి " కథ చదివారా? అనేక విషయాల్లో మంచి కథ. ఈ సారి చర్చిస్తాను లెండి నా కథానుభవం లో.

నాగేస్రావ్ said...

"..ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు.."
ఇది చదివిన వేంఠనే పొయ్యిమీద కుక్కర్లో పప్పు పడేశాను.

సుజాత వేల్పూరి said...

ఊ..! ఇప్పుడర్థమైందిలే ఆ ఫొటో ఎలా తీశారో!:-))

శ్రీరామ్ said...

నయానాందకరం :-)

కమల్ said...

చాలా బాగున్నాయి మీనాక్షి ఆలయ విశేషాలు, అలాగే ఫోటోలు కూడ చాలా బాగా తీసారు, ముఖ్యంగా కోటలోని విశేషాలు చాలా బాగున్నాయి. ప్చ్..నేనింకా చూడ లేదు ఆ ఊరుని..ఎప్పుడు చూస్తానో..??

నిషిగంధ said...

Amazing!!
మీ ఫోటోలతోనే సగం చూశేసిన ఫీలింగ్ వచ్చింది.. అసలెప్పుడు చూస్తానో :(
చాలా చాలా బాగా వివరించారు! థాంక్యూ :-)

ఆ.సౌమ్య said...

@ కల్పన గారూ
నెనర్లు. "మధుర మీనాక్షి" కథ చదవలేదండీ, ఎవరు రాసినది? మీరు పరిచయం చెయ్యండి, తప్పకుండా చదువుతాను.

@ సుజాత గారు
హమ్మయ్య, అర్థమయింది కదా :)

ఆ.సౌమ్య said...

@ నాగేస్రావు గారు
బహుకాల దర్శనం,నెనర్లు...ఇంతకీ పప్పు ఉడికిందా, లేదా? ఇంత నెయ్యి, అంత ఆవకాయ వేసుకుని కుమ్మేయండి చెప్తాను :D

@శ్రీరామ్ గారు
Thank you so much!

బాలు said...

ఫొటోలు అద్భుతంగా ఉన్నాయండీ, ఏ కెమెరాతో తీశారు?

ఆ.సౌమ్య said...

@కమల్
ధన్యవాదములు, ఎప్పుడో ఒకప్పుడు తప్పక చూస్తారులెండి, మరీ అలా దిగాలుపడిపోకండి. మీకు చూసే అవకాశం త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. :)

@ నిషిగంధ
నెనర్లు, హమ్మయ్య మీకు సగం చూసేసిన ఫీలింగ్ వచ్చింది కదా, సంతోషం. త్వరలోనే మీకు మొత్తం చూసే అవకాశం వస్తుందిలెండి :)

ఆ.సౌమ్య said...

@బాలు
ధన్యవాదములు. Canon తో తీసినవండీ.

బులుసు సుబ్రహ్మణ్యం said...

సుమారు ఇరవై ఏళ్ళ క్రితం నేను వెళ్ళినప్పుడు ఇల్లా లేదండీ గుడి.పరమేస్శరన్ వెంకటేశన్ ఎవడో గుర్తు లేదు కాని గుడి అంతా పరిగెట్టించి అరగంటలో బయటకు తీసుకోచ్చేసాడు. పైగా బయటకు తీసుకొచ్చి దిస్ ఈజ్ గుడి అండ్ దట్ ఇజ్ వాటర్ టేంకు. నౌ యు గెట్ ఇన్ టు ది బస్ అన్నాడు. మళ్ళీ వెళ్ళాలనుకుంటాను. కళా హృదయం ఉండాలను కుంటాను ఇల్లాంటివి చూడాలన్నా. ఫొటోలు బ్రహ్మాండంగా ఉన్నాయి.
అసలు మాట, ముద్దపప్పు, కొత్త ఆవకాయ, నెయ్య+వెన్న బ్లాగర్ల సంఘం కూడా పెట్టేస్తే బాగుంటుంది.

Sujata M said...

ముద్దపప్పులో ఆవకాయ కలుపుకున్నట్టు - Sincere expression.

(1) The post is superb.

(2) I did not know until now, that we can upload so many pictures in blogger (in one single post !)

(3) U must have prepared some notes during the visits. Bloggimg like this needs planning I believe !

ఆ.సౌమ్య said...

@బులుసు వారికి
ధన్యవాదములు.అయ్యో మీకు మంచి గైడ్ దొరికినట్టు లేడు అయితే. మాకు వేయి స్థంబాల గుడిలో ఉండే సెక్యూరిటీ గార్డ్ వివరాలు తెలియజేసాడు. అలాగే కోటలో కూడా గార్డ్‌నే అడిగాం, అతనే అన్నీ వివరించాడు. ఏదో కాస్త తృణమో, పణమో సమర్పించుకున్నాం అంతే. ఇవన్నీ చూడాలంటే బోలెడంత టైమ్ పెట్టుకుని వెళ్ళాలి. మరోసారి వెళ్ళి రండి, అన్నీ చూద్దురుగాని. ఇప్పుడు నేను గైడెన్స్ కూడా ఇచ్చాను కదా, ఇంక మీకు గైడ్ అవసరం లేదు. హాయిగా ఆస్వాదించొచ్చు అన్నీ, ఏమంటారు? :)

అసలు మాట: బాబ్బాబు ఆ సంఘమేదో పెట్టేసి నాకు అధ్యక్ష పదవో, సెగట్రీ పదవో ఇప్పించేయండి....నేను 24 గంటలూ ముద్దపప్పు+ఆవకాయ+నెయ్యి గురించి మాట్లాడమంటే మాట్లాడగలను. :D

ఆ.సౌమ్య said...

@sujata గారు
నెనర్లు. :)

1)ధన్యవాదములు

2)అయ్యో ఫొటో బ్లాగుల గురించి మీకు తెలీదా అండీ, నాకు కూడా ఒకటుంది.
http://cheluvamulu.blogspot.com/
బ్లాగుల్లో ఒక పోస్ట్‌లో ఎన్ని కావాలంటే అన్ని ఫొటోలు పెట్టుకోవచ్చు, మీరూ ఒకసారి ప్రయత్నించండి.

2)నేను నోట్స్ ఏమీ రాసుకోలేదండీ, కాకపోతే కుప్పలు తెప్పలు ఫొటోలు తీసుకున్నాను. వాటిని చూస్తే నాకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. పైగా అవి మనం మరచిపోవాలనుకున్నా మరచిపోలేని ప్రదేశాలు, అనుభూతులు... ఎలా మరచిపోతానండీ!

స్నిగ్ధ said...

సౌమ్య గారు, చాలా బాగున్నాయి ఫోటోలు. గుడి విశేషాలని చాలా చక్కగా వర్ణించారు. అమ్మవారిని దర్శించుకునే భాగ్యం నాక్కూడా కలిగిందండోయ్ ..గుడి లో అడుగు పెట్టినప్పటినుంచి బయటకి వచ్చేంతవరకు ఒక తెలియని ఆనందంలో ఉన్నాను. అమ్మవారి సన్నిధి,సుందరేశ్వరుని సన్నిధి, ఆలయం లోని కోనేరు ,అందులోని బంగారు పద్మం ఇవ్వన్నీ చూశాము. కాని సమయాభావం చేత గుడి మొత్తం చూడ్డం కుదరలేదు.:( నాకు సరిగ్గా గుర్తు లేదు గానీ అయ్యవారి సన్నిధి పక్కనే అనుకుంటా మేధా దక్షిణామూర్తివారి సన్నిధి ఉంది. చాలా బాగుంటుంది చూశారా... మధురై వెళ్ళిన ప్రతిసారి అమ్మ గుడికి వెళ్ళొచ్చాము కానీ తిరుమల నాయకర్ మహల్ మిస్సయ్యము అండీ...ఏం చేస్తాము ప్రాప్తం లేదు... కానీ మీ ఫోటొలతో మళ్ళీ మధురైని చూసొచ్చా గా... అందుకు మీకు బోలెడు థాంకూలు...

ఆ.సౌమ్య said...

@స్నిగ్ధ గారూ
ధన్యవాదములు, మీరూ వెళ్ళారా మధురై.....భలే ఉంటుంది కదండీ, అవునండీ మేధా దక్షిణామూర్తి సన్నిధి కూడా బావుంటుంది. మీరు వేయి స్థంబాల మండపం చూసారా? మీనాక్షి గుడి నుండి తిరుమల నాయకర్ మహల్ పెద్ద దూరం కాదండీ, ఈసారి వెళ్ళినప్పుడు తప్పక చూసి రండి. నా టపా మీకు మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చినందుకు ఆనందంగా ఉంది.

శివరంజని said...

చాలా బాగున్నాయి మీనాక్షి ఆలయ విశేషాలు, అలాగే ఫోటోలు కూడ చాలా బాగా తీసారు, థాంక్స్ సౌమ్య గారు...
ఇప్పుడు మాలిక చూస్తే 3 పార్ట్ ఉంది 2 వ పార్ట్ ఎప్పుడు రాశారబ్బా !! నేను మిస్సయ్యాను

ఆ.సౌమ్య said...

@శివరంజని
ధన్యవాములు, రెండవ భాగం సోమవారమే పోస్ట్ చేసాను. నాది, నేస్తం ది, అసైన్సు కబుర్లు ఒకే టైమ్‌లో రావడంతో నా టపా కాస్త వెనకబడింది అంతే :D

ఫొటోలు, కబుర్లు నచ్చినందుకు సంతోషం :)

సవ్వడి said...

Excellent...
inka comments cadavaledu. mallee cusi, cadivi comment pedata..

ఆ.సౌమ్య said...

@సవ్వడి
Thanks! అలాగే అన్నీ తీరికగా చదివి మళ్ళీ కామెంటు పెట్టండి, తొందరేం లేదు.

కొత్త పాళీ said...

ఓ మదురై కూడ వెళ్ళారా? మీనాక్షి ఆలయంలో నేనూ చాలా ఫొటోలు తీశాను కానీ మీరు తీసినవి చాలా బాగున్నై - ముఖ్యంగా స్తంభాల మధ్యలోంచి.

ఆ.సౌమ్య said...

@కొత్తపాళీ గారూ
నెనర్లు, అవునండీ మధురై కూడా వెళ్ళాము...మొత్తం ఓ చుట్టి చుట్టి వచ్చాములెండి. :) ఇంకా చూసాము, రాబోయే భాగాలలో అవీ ప్రస్తావిస్తాను .ఫొటోలు మీకు నచ్చినందుకు సతోషం.

వజ్రం said...

ఫోటోలు చాలా బాగున్నాయండి.మీరు చాలా చూపించేసారు,మిగిలింది త్వరలో చూడాలని ఉంది.
ఆకాలంనాటి కళను మెచ్చుకుంటూనే, సుందరేశుని పడకగది విషయంలో వెర్రివాళ్ళనేసారే, కొంచెం బాదేసింది.ఏది ఎందుకో,ఏది నిజమో దైవానికే ఎరుక.

ఆ.సౌమ్య said...

@వజ్రం
ధన్యవాదములు, మీరు త్వరలోనే ఆ ప్రదేశాలన్నీ చూడగలరని ఆశిస్తున్నాను. ఒకవేళ దేవుడనేవాడే ఉంటే అక్కడ మధురైలో పడకగది కావాలని కోరుకుంటాడని నేను అనుకోను, అదంతా మానవ నిర్మితమే, అందుకే వెర్రితనం అన్నాను. ఇది నా అభిప్రాయమే సుమండీ.

మీ బ్లాగు ఇప్పుడే చూసాను, బావుండండీ, వైవిద్యమైన విషయాలు రాస్తున్నాను, keep it up!

సవ్వడి said...

సౌమ్య! ముందు ఎవరెవరు వెళ్లారో చెప్పండి. అందరూ కళాహృదయులేనా.... లేకపోతే అంత టైమ్ కేటాయించడం కుదరదు కదా!

పొటోలు చాలా బాగా తీశావు. నీ పొటోలు చూశాక ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది. ఎప్పుడౌతుందో ఏంటో!

ఇంతకీ కామన్ వెల్త్ గేమ్స్ కి వెళ్తున్నావా... కుదిరితే వెళ్ళు. మెంచి పొటోలు తీసి ఒక పోస్ట్ పెట్టు.

ఆ.సౌమ్య said...

@సవ్వడి
ధన్యవాదములు,హ హ హ అవును వెళ్ళిన వాళ్ళందరూ కళా హృదయులే, కానీ ఫొటోలు మాత్రం నేనే తీసాను :D త్వరలో మీకు వెళ్ళే అవకాశం వస్తుందని భావిస్తున్నాను.

కామన్ వెల్ట్ గేమ్స్ ఆ...పిచ్చ నాకేమైనా అక్కడకి వెళ్ళడానికి? ఆ పేరుతో ఏమేమి అరాచకాలు జరుగుతాయో అని భయపడి చస్తూ ఉంటే. అసలు రోడ్ మీదకే ఎక్కువ వెళ్ళకూడదని జనాలు భయపడి ఇళ్ళల్లోనే టీవీల ముందు కూర్చుంటున్నారు.

రాజ్ కుమార్ said...

సౌమ్య గారు.. అద్భుతమైన టప రాసేరు. ముఖ్యం గా ఫోటోలు అత్యద్భుతం... ఆ ఫోటోలు చూసి వాళ్ళు పులకరించిందండి.. మీ కెమేరా జన్మ ధన్యం అయ్యిపోయింది
చెక్కిన చేతులకి జోహార్లు.... ఫోటోలు తీసిన చేతులకి జేజేలు.. :) :)

ఆ.సౌమ్య said...

@వేణూరాం
ధన్యవాదములు, మీ జేజేలు అందాయి, Thanks :)

మనోజ్ఞ said...

మూడవ పోస్ట్ లో కొంచెం పస తగ్గినట్టు కనిపించింది. రెండవ పోస్ట్ కి ఇచ్చినంత వివరణ ఇందులో రాయలేదు కారణం? ఈ పోస్ట్ లో ఫోటోలు బాగున్నాయి. వాటి గురించి మరింత వివరణ రాస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ముద్దపప్పు పేరాకు మాత్రం మినహాయింపు ఉంది. ఆ పేరా బాగుంది.

ఆ.సౌమ్య said...

@మనోజ్ఞ
Thanks! పస తగ్గిందా, ఎమో మరి....ఈసారి ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తా.

మాలా కుమార్ said...

చూసిన అనుభూతి కలిగించారు . మీ ఈ పోస్ట్ లు చదువుతుంటే ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అనే కోరికను కలిగిస్తున్నారు . బాగున్నాయి ఫొటోలు .

ఆ.సౌమ్య said...

@ మాలా కుమార్ గారూ
ధన్యవాదములు, వెళ్ళి రండి , మీకేంటి....కన్నులపండువ హామీ.

yab said...

Fantastic pics. Yet to read the post, have to get over the pics to read the post :)

ఆ.సౌమ్య said...

@Yab
Thanks a lot! I hope you will read the post as well :)

Anonymous said...

sowmya garu " MANY MANY HAPPY RETURNS OF THE DAY "

ఆ.సౌమ్య said...

@Krupal gaaru "THANK YOU SO MUCH" :)

వేణూశ్రీకాంత్ said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సౌమ్య గారు :-)

ఆ.సౌమ్య said...

హృదయపూర్వక ధన్యవాదములు వేణూ శ్రీకాంత్ :)

మనసు పలికే said...

ఆహ్.. సౌమ్య గారు.. మీ పుట్టిన రోజా ఈరోజు..:) మీరు ఇలాగే మరిన్ని సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని.., మంచి మంచి టపాలతో మమ్మల్ని ఆనందింపజేయాలని.. మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..:)

ఆ.సౌమ్య said...

hay, thanks అపర్ణా! :)
నీ కోరిక తీరాలని నేనూ కోరుకుంటున్నాను ;)

3g said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

3g said...

Excellent pics. ఈ పోస్టు నేను చూసేసానేమో అనుకొని ఇప్పటిదాకా చూళ్ళేదండీ. ఆ గుడిని ఇంతబాగా నిర్వహిస్తున్న వాళ్ళు గ్రేట్, వాటిని అంతకంటే బాగా ఫోటోలు తీసి మాకందించిన మీరు ఇంకా గ్రేట్.

ఆ.సౌమ్య said...

@3g
హృదయపూర్వక ధన్యవాదములు :)

అవునండీ గుడి నిర్వహణ చాల బాగుంది, నా ఫొటోలు మెచ్చినందుకు Thanks!

..nagarjuna.. said...

ఈ రోజు మీ పుట్టినరోజాండీ...
య్యాపి య్యాపి బర్తుడే... పుట్టినరోజు శుభాకాంక్షలు.


ఫొటోలను పంచుకున్నందుకు ధన్యవాదాలు...ఇన్నిరోజులు మీనాక్షి గుడిని అరవదేశంలో ఉండే ఓ ప్రసిద్దగుడి మాత్రమే అనుకున్నా...గుడిలో ఇంత శిల్ప సంపద ఉందా, ఐతే తప్పక చూడాలి.

>>అన్నిటినీ తనివితీరా చూసి, గొప్పదైన స్పూర్తితో, హృదయాంతరాళాల్లోంచి పొంగిన ఆనందంతో గుడి బయటకొచ్చాము. చాలు, ఇక అన్నం తినకపోయినా ఫరవాలేదనిపించింది.<<

మొన్నీమధ్య పూరీ-కోణార్క్ వెళ్ళినపుడు అలాగే అనపించింది. కోణార్క్ సూర్యదేవాలయంలో కేవలం ప్రధాన గోపురం, నాట్యశాల మాత్రమే మిగిలున్నాయి ఇప్పుడు...ఐతేనేమి వాటిపై చెక్కిన ఆకృతులు, శృంగార భంగిమలలో చెప్పదలచుకున్న వైద్య సూచనలూ, ఆథ్యాత్మికత చూసి ఔరా అనుకున్నాం... hats-off to their meticulous skill

భాస్కర రామిరెడ్డి said...

సౌమ్య,మీకు పుట్టినరోజు శుభాకాంక్షలుతో ఆ చెక్కిన చేతులకు జేజేలు .

ఆ.సౌమ్య said...

@ నాగార్జున
చాలా చాలా thanks
నేనూ పూరీ, కోణార్క చూసాను. పూరీ ఏమీ నచ్చలేదుగానీ, కోణార్క చాలా బావుంటుంది.

ఆ.సౌమ్య said...

@ భ.రా.రే
ధన్యవాదములు మీ శుబాకంక్షలకి, కామెంటుకి. :)

గీతాచార్య said...

ఫటోలతో మాయ చేశారు శశిరేఖ గారు...

బ్లాగు బాబ్జీ said...

Happy Birthday :)

chusava evari blaguki rani vanni ivala nee blaaguki vachi mari cheppanu :)

All the best, Enjoy your day.

Blaagu baabji

ఆ.సౌమ్య said...

@గీతాచార్య
హహహ మాయలు వచ్చో రాదో అని టెస్ట్ చేసుకుంటున్నాను. Thanks!

ఆ.సౌమ్య said...

@బ్లాగుబాబ్జీ
వామ్మో, ఇది కలా, నిజమా....మీరే, నిజంగా మీరేనా!

anyways, thank you so much :)

జయ said...

మీకు జన్మదిన శుభాకాంక్షలు. మధురై విశేషాలు చాలా బాగా చెప్తున్నారు. ఎలా అయినా వెళ్ళి చూడాలనిపిస్తుంది.

జయ said...

అది 'సంఘం' కాకుండా 'సంగం' కాలమనుకుంట. తమిళ సాహిత్యానికి చాలా ప్రముఖమైన యుగం అది. ఎంతో బాగా రాసిన మీకు నేనిలా రాయటం బాగోదు. ఏమనుకోకండి.

ఆ.సౌమ్య said...

@జయ గారూ
మీ శుభాకాంక్షలకు ధన్యవాదములు :)

నా టపా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. అవునండీ అది "సంగం" కాలమే, పొరపాటున రాసాను. అయ్యో తప్పు రాసినప్పుడు చెబితే ఫరవాలేదండీ, నేనేమీ అనుకోను. సరి చేసినందుకు చాలా చాలా థాంక్స్!

Anonymous said...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి

kanthisena said...

ఆలస్యంగా ఈ కథనం చూస్తున్నాను. ముందుగా చక్కటి బొమ్మలు తీసినందుకు అభినందనలు. చిన్న సూచన. కథనంలో ప్రతిచోటా మధురై అని వత్తి పలికి రాశారు. కానీ అది మదురై మాత్రమే. దు కి వత్తు లేదు. తమిళనాడు నుంచి వచ్చే తెలుగు టాబ్లాయిడ్స్‌లో కూడా ఈ పదాన్ని వత్తు లేకుండానే రాస్తున్నారు. కొత్తపాళీ గారి కామెంటులో సరిగానే ఉంది. కానీ కింద మళ్లీ మీరు మధురై అని వక్కాణించారు. నాకు తెలిసి తమిళ భాషలో మహా ప్రాణాలు లేవు. ప్రతిదీ అక్కడ పరుష సరళాలే.. కాని ఒత్తక్షరాలు ఉండవు. బహుశా మీకీ విషయం తెలియకపోయి ఉండవచ్చు.
మంచి కథనానికి మరోసారి అభినందనలు.

ఆ.సౌమ్య said...

@ చందమామ
మీ సూచనకి ధన్యవాదములు. తమిళంలో ఒత్తులుండవని నాకు తెలుసండీ. నాకు తమిళ్ బాగా వచ్చు రాయడం చదవడంతో సహా. కాకపోతే వ్యాసం తెలుగులో రాయడం వలన అలవాటులో పొరపాటులా "ద కి ఒత్తు" పెట్టేసాను. మీరు చెప్పేవరకూ నేనూ అది గమనించలేదు. చాలా థాంక్స్. సరి చేస్తాను.

నా ఫొటోలు మీకు నచ్చినందుకు సంతోషం.

kanthisena said...

ఓ..మీకు తమిళం రాయటం చదవడం కూడా వచ్చన్నమాట. చాలా సంతోషం. గత 15 సంవత్సరాలుగా జీవిక కోసం చెన్నయ్‌లో ఉన్నా తమిళం నాకు వంటబట్టడంలేదు. ఆ లిపిని గుర్తు పెట్టుకోవడం మనకు ఎంత కష్టంగా ఉన్నా మాతృభాష తర్వాత మనం ముందుగా నేర్చుకోవలసిన భాష తమిళమే అని నా ఉద్దేశం. భాషను ఎంతగా వీరు దేశీయ మూలాల్లోకి వీళ్లు మార్చేశారంటే కొన్ని ఇంగ్లీషు పదాలను వీళ్లు తమిళీకరించిన తీరుకు మనసు ఉప్పొంగిపోతుంది. డీలక్స్ బస్సు పదాన్ని వీరు సొగసు వం(బం)డి అంటూ పలుకుతారు. వింటూంటేనే ఎంత బాగుంటుందో.. ప్రతి పరాయి పదాన్నీ దేశీయ తమిళంలోకి మార్చే వీరి తపనను, భాష పట్ల వీరి అనురక్తిని ప్రతి భారతీయుడూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇతర భాషల ఉనికిని లేకుండా చేస్తున్న తమిళ ప్రభుత్వాల దురహంకారం మనకు మంట తెప్పించినా సరే భాష పట్ల వీరి అభిమానం ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాల్సిందే. తెలుగులో దాదాపు 50 నుంచి 60 శాతం పదాలు సంస్కృతంతోనో, ఉర్దూతోనో, ఇంగ్లీషుతోనో నిండిపోయి ఉన్నాయని లోకలైజేషన్ ప్రాజెక్టులలో చర్చల సందర్భంగా తమిళులకు చెబితే పగలబడి నవ్వుతుంటారు. అదే మనకూ వాళ్లకూ తేడా.. ఇక్కడ సందర్భోచితంగా లేకున్నా పంచుకుంటున్నందుకు క్షమాపణలు.

ఆ.సౌమ్య said...

@ చందమామ
ఓ మీ నివాసమక్కడేనా...బావుంది. తమిళ్ చదవడం సులువేనండీ కాకపొతే "ప,బ", "క,గ" లాంటి అక్షరాలు వచ్చినప్పుడు ఏది పలకాలో కాస్త ఆలోచించి జాగ్రత్త గా పలకాలి. అలాగే కొన్ని కొత్త అక్షరాలు కొత్తవి ఉంటాయి. నేను హైదరాబాదులో ఉండి తమిళ్ నేర్చుకున్నాను. మీరు అన్నళ్ళున్నానంటున్నారు మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, ప్రయత్నించండి.

మీరు చెప్పినది ముమ్మాటికి నిజం. అన్ని పదాలను వాళ్ళు తమిళీకరించిన రీతి బహు ముచ్చటగా ఉంటుంది. అసలు సంస్కృతపదమే లేకుండా, ఇంగ్లీషు, హింది, ఉర్దూ వాడకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఒళ్ళు పులకించడమే కాకుండా మనసులో ఏదో మూల కాస్త సిగ్గు కూడా వేస్తుంది. మనం వాళ్ళ నుండి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది. మాతృభాషపై మక్కువ ఎక్కువగా ఉన్నా, తమిళ్ మాట్లాడడం, చదవడం నేను చాలా ఆస్వాదిస్తాను. మీరు మంచి విషయాన్ని ప్రస్తావించారు, చాలా సంతోషం.

గిరీష్ said...

u r right..chekkina chethulaku joharlu

ఆ.సౌమ్య said...

@గిరీష్
ధన్యవాదములు :)

pallavi said...

bangaru gopuram kadu vimanam ane antaranukuntunna...oksari kanukkondi.